మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో హీరో కమల్హాసన్కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సంద్భంగా తన చిరకాల మిత్రుడుని మెగాస్టార్ తన ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానించటమే కాదు సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ ముఖ్య అతిథిగా, హీరోలు నితిన్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అఖిల్తో పాటు తెలుగులో విక్రమ్ని విడుదల చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














