Namaste NRI

ప్రపంచస్థాయి ఫ్రాంచైజీ చిత్రంగా..మిరాయ్‌

తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన సోషియో ఫాంటసీ డివోషనల్‌ థ్రిల్లర్‌ మిరాయ్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం లో పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత నెల 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బ్రహ్మాండ్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్‌ విడుదలై 45రోజులు అయ్యింది. ఓటీటీకి వచ్చేంతవరకూ థియేటర్లలో రన్‌ అవుతూనేవుంది. ఓటీటీకి వచ్చేశాక కూడా ఈ ఈవెంట్‌ పెట్టడంలోనే తెలుస్తున్నది నిర్మాత విశ్వప్రసాద్‌ ఈ సినిమాను ఎంత ప్రేమించారో. మాకు ఇంతటి బ్రహ్మాండ్‌ బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనికి కృతజ్ఞతలు అని అన్నారు.

అగ్ర నిర్మాత వై.రవిశంకర్‌, దర్శకులు మారుతి, వెంకటేశ్‌ మహా, సంపత్‌నంది, శ్రీరామ్‌ ఆదిత్య ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు అందంచారు. తెలుగులో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా మిరాయ్‌ నిలుస్తుందనేది ఓటీటీ రిపోర్ట్‌. దేశంలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఆశాభావం వెలిబుచ్చారు. మిరాయ్‌ ఓ మ్యాజిక్‌ అనీ, అందరి కొలాబరేషన్‌ తో ఈ విజయం సాధ్యమైందని దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కథానాయిక రితిక నాయక్‌, సంగీత దర్శకుడు గౌరహరి, పంపిణీదారుడు శశిధరరెడ్డిపాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News