Namaste NRI

భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు … ఎప్పటి నుంచంటే

ప్రపంచ సుందరి(మిస్‌ వరల్డ్‌) 71వ ఎడిషన్‌ పోటీలు భారత్‌లో ఈ నెల 18 నుంచి జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. న్యూఢిల్లీలో ప్రారంభ వేడుకతో పోటీలు ఈ నెల 18  ప్రారంభమై మార్చి 9 ముంబైలో ముగస్తాయి. న్యూఢిల్లీలోని భారత్‌ మండపం సహా వివిధ వేదికల్లో పోటీ జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా పట్ల నాకున్న ప్రేమ దాచలేనిది. ఈ దేశంలో ప్రపంచ సుందరి పోటీ జరగడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది అని మిస్‌ వరల్డ్‌ సంస్థ సీఈవో, అధ్యక్షురాలు జులియా మోర్లే అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events