Namaste NRI

తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి ఖతర్‌ బతుకమ్మ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏ గడ్డపైనా ఉన్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా స్వీయ సంస్కృతిపై మక్కువతో, మాతృభూమిపై మమకారంతో మన సంస్కృతిని, పండుగలను జరుపుకుంటున్న ప్రవాస తెలంగాణ వాసుల కృషి ఆమె కొనియాడారు. అనంతరం తెలంగాణ జాగృతి ఖతర్‌ అధ్యక్షుడు నందిని అబ్బగౌని మాట్లాడుతూ అక్టోబర్‌ 8న ఖతర్‌లో మహా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దోహలోని ఐసీసీ అశోక హాల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. కరోనా నిబంధనల మేరకు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన నవీన్‌ ఆచారి, జాగృతి ఖతర్‌ కార్యవర్గ సభ్యులు స్వప్నా కేశా, శ్రీధర్‌ అబ్బగౌని, అభిలాష్‌ బండి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events