రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే భారత్పై అధిక సుంకాలు బాదిన ట్రంప్ ఈయూ, జీ-7 దేశాలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. భారత్ దిగుమతులపై అమెరికా తరహాలోనే అధిక సుంకాలు విధించాలని ఆయా దేశాలకు సూచిస్తున్నారు. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్ ఇచ్చింది.

అమెరికా తరహాలోనే ఇతర దేశాలు కూడా భారత్పై టారిఫ్లు విధించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఢిల్లీతో తమ సంబంధం స్థిరంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ-మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవడం ఖాయం. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్ను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
















