Namaste NRI

అగ్రరాజ్యం అమెరికాకు మాస్కో కౌంటర్‌

రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే భారత్‌పై అధిక సుంకాలు బాదిన ట్రంప్ ఈయూ, జీ-7 దేశాలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. భారత్‌ దిగుమతులపై అమెరికా తరహాలోనే అధిక సుంకాలు విధించాలని ఆయా దేశాలకు సూచిస్తున్నారు. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్‌ ఇచ్చింది.

అమెరికా తరహాలోనే ఇతర దేశాలు కూడా భారత్‌పై టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఢిల్లీతో తమ సంబంధం స్థిరంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ-మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవడం ఖాయం. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్‌ను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events