మిస్సెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో భారతీయ మహిళ రాధిక బోసలే రన్నరప్గా నిలిచారు. అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో నిర్వహించిన ఈ పోటీలో పూణేకు చెందిన రాధిక రన్నరప్గా ఎంపికయ్యారు. రాధిక బోసాలే ప్రస్తుతం అమెరికాలోని ఓ టెక్ స్టార్టప్ కంపెనీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ముంబైలో పుట్టిన పెరిగిన ఆమె ఇంజినీరింగ్తో పాటు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఆమె మాస్టర్స్ చేశారు. అమెరికాలో ఎన్నో సంస్థలకు రాధిక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఆమె భర్త ఫేస్బుక్లో సీనియర్ సెక్యూరిటీ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది.
వర్జీలియా ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో కేవలం అందం, డ్రెస్సింగ్ కాకుండా, పోటీదారులు ఏ మేరకు సమాజ సేవ చేశారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బాలికల అభ్యున్నతికి పాటుపడటమే తన లక్ష్యమని అన్నారు. ఈ అందాల పోటీల్లో మొత్తం 48 ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.