Namaste NRI

కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్

కాంగ్రెస్‌ నేతలు బలరాం నాయక్‌, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలు అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో హనుమకొండలో కేసు నమోదైంది. విచారణకు హాజరుకాని ముగ్గురు కాంగ్రెస్‌ నేతలపై హైదరాబాద్‌ లోని ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టు  ముందు హాజరుపరచాలని సూచిస్తూ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. కోర్టుకు ముగ్గురూ హాజరు కాకపోవడంతో కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. వారెంట్‌ జారీతో ఆలస్యంగా కోర్టుకు చేరుకున్న బలరాం నాయక్‌కు ఉపసంహరణ లభించింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 3కు వాయిదా పడిరది.

Social Share Spread Message

Latest News