Namaste NRI

దుబాయ్‌లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి కార్యక్రమాన్ని దుబాయ్‌లోని ఎన్నారై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విభాగం అత్యంత భక్తిశ్రద్ధల తో నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, సభ్యులందరూ పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, జ్ఞాపకాలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న పలువురు ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events