Namaste NRI

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

లోక్‌సభ స్పీకర్‌గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. సభలో చేపట్టిన మూజువాణి ఓటింగ్‌ అనంతరం ఓం బిర్లా గెలిచినట్టు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. దీంతో గత టర్మ్‌లో కూడా స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం బిర్లా వరుసగా రెండోసారి ఆ పదవిని చేపట్టారు. రెండోసారి స్పీకర్‌ అయిన వాళ్లలో ఓం బిర్లా ఐదో వ్యక్తి. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇతర ఎంపీలు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మోదీ, రాహుల్‌ వెంట రాగా.. ఓం బిర్లా స్పీకర్‌ కుర్చీలో ఆసీనులయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events