
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిసారి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం సుమారు 30 నిమిషాలపాటు కొనసాగినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్లో అనంతర పరిస్థితులపై మోదీ, ఒమర్ అబ్దుల్లా చర్చించినట్లు తెలిసింది.
