Namaste NRI

వాఘా సరిహద్దుల్లో .. వందేమాతరం

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నచిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌. మానుషి చిల్లార్‌ కథానాయిక. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ పతాకాలపై సందీప్‌ ముద్దా నిర్మించారు.  ఈ సినిమాలోని వందేమాతరం అనే తొలి గీతాన్ని వాఘా సరిహద్దుల్లో ఆవిష్కరించారు. అక్కడ రిలీజ్‌ చేసిన మొట్ట మొదటి పాటగా చరిత్ర సృష్టించిందీ గీతం. దేశభక్తి ప్రధానంగా ఈ పాట సాగింది. వైమానిక దళం పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు చూపే ఈ పాటను దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేస్తున్న వరుణ్‌ తేజ్‌ ఈ పాటలో యూనిఫాంలో కనిపించారు. మానుషి చిల్లార్‌ యుద్ధంలో ఉన్న తన ప్రియుడు (వరుణ్‌ తేజ్‌) గురించి ఆందోళన చెందే రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించింది. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చారు. ఈ పాటను తెలుగులో అనురాగ్‌ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్‌ సింగ్‌ పాడారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడు. తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events