Namaste NRI

పహల్గాం దాడి చాలా చెత్త పని … ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలి

పాకిస్థాన్ ప్రోద్బలంతో జరిగిన పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఆ దాడి చాలా చెత్త పని అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌కు సంఘీభావం తెలిపిన ట్రంప్,  కశ్మీర్‌లో ఘర్షణలు వందల ఏళ్లుగా సాగుతున్నాయని అన్నారు. ఈ సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకుందని అన్నారు. పోప్ అంత్యక్రియలకు వాటికన్ నగరానికి వెళ్లే ముందు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో  ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

 నేను భారత్‌కు సన్నిహిత మిత్రుణ్ణి. పాక్‌తోనూ క్లోజ్ గానే ఉంటాను. అయితే, కశ్మీర్‌లో ఘర్షణలు వెయ్యి ఏళ్లుగా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నుంచి కూడా ఘర్షణలు జరుగుతూ ఉండొచ్చు. నిన్నటి దాడి మాత్రం చాలా చెత్త పని. అయితే, ఈ సమస్య భారత్, పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉన్నదే. 1500 ఏళ్లుగా అక్కడి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. నాకు భారత్, పాక్ దేశాధినేతలు ఇద్దరూ బాగా తెలుసు. ఈ సమస్యను వాళ్లు ఏదోవిధంగా పరిష్కరించుకుంటారు  అని ట్రంప్ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events