Namaste NRI

పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది.. సింధునదిలో భారీగా!

ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికతలో అంతర్భాగమైన చార్రితక సింధు నది ఇప్పుడు స్వర్ణ గంగగా మారింది. ఈ నది ఇప్పుడు పాకిస్థాన్‌కు బంగారు రాశులిచ్చే కల్పవల్లిగా మారింది. ఈ నది లో ఎవరూ ఊహించనంత బంగారు నిక్షేపాలు దాగి ఉన్నట్టు  తెలిసింది. వాటి విలువ పాకిస్థాన్‌ కరెన్సీలో రూ.60 వేల కోట్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.18,500 కోట్లు) ఉండవచ్చు.

పంజాబ్‌ ప్రావిన్సులో ప్రవహించే సింధు నదిలో బంగారంతోపాటు ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలు  ఉన్నాయి. పాకిస్థాన్ కు ఉత్తరం వైపున ఉన్న హిమాలయాల నుంచి వేగంగా వస్తున్న నదీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న బంగారు రేణువులు నది ఒడ్డుకు చేరుకుంటున్నాయని తెలిసింది. హిమాలయాల నుంచి సింధు నది రవాణా చేస్తున్న బంగా రు నిల్వలు దాదాపు 32.6 మెట్రిక్‌ టన్నులు ఉంటాయని పాకిస్థాన్‌కు చెందిన పార్లమెంట్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ బంగారు నిక్షేపాలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events