Namaste NRI

పసివాడి ప్రాణం రిలీజ్‌కు రెడీ

అల్లు వంశీ, ఇతి ఆచార్య జంటగా నటించిన చిత్రం పసివాడి ప్రాణం. ఎన్‌.ఎస్‌.మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దర్శక, నిర్మాత మూర్తి మాట్లాడుతూ లైవ్‌ కం యానిమేషణ్‌ చిత్రమిది. అప్పటి పసివాడి ప్రాణం చిత్రంలో బాలనటుడుగా ఆకట్టుకున్న సుజిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. హీరో అల్లు వంశీ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన ఎన్‌ఎస్‌ మూర్తిగారికి రుణపడి ఉంటానన్నారు. ఈ చిత్రంలో సాయి, యోగి, రుబినా, ఎఫ్‌ఎం బాబాయ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Social Share Spread Message

Latest News