వార్ 2 సినిమాను ఇష్టంతో కష్టపడి తెరకెక్కించాం. ప్యాషన్తో చేసిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. వార్ 2 ఓ అద్భుతం. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే చూడండి. సినిమా చూసిన వారు దయచేసి కథలోని సీక్రెట్లను, ట్విస్ట్లను రివీల్ చేయొద్దు. అలా రివీల్ చేసేవాళ్లను కూడా మీరే ఆపాలి. ఇది మీడియాకు, ప్రేక్షకులకు, అభిమానులకు మా విజ్ఞప్తి అని వార్ 2 కథానాయకులైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు ప్రత్యేకంగా చెప్పారు.

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వారిద్దరూ కలిసి నటించిన వార్ 2 నేడు విడుదలకానున్న సందర్భంగా వారు ఈ ప్రకటన విడుదల చేశారు. వార్2 ని తొలిసారి చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, థ్రిల్ మాటల్లో చెప్పలేం. మీరేకాదు, మీ తర్వాత చూసేవాళ్లు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలంటే, కథలోని సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయకూడదు. అలా చేస్తే మీ తర్వాత చూసేవారికి ఆ అనుభూతి దక్కదు. దయచేసి వార్ 2ని రహస్యంగా ఉంచండి అని ఎన్టీఆర్ ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన విషయం తెలిసిందే.















