
సన్నీ అఖిల్, రవికాలె, అజయ్ఘోష్, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. బాజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్ నిర్మాత. ఈ సినిమా నుంచి ఓ ప్రేమగీతాన్ని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. సాధారణంగా హీరోహీరోయిన్లు ప్రేమగీతాలను పాడుకుంటారని, అందుకు భిన్నంగా ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్లు పాడుకోవడం వెరైటీ కాన్సెప్ట్ అని ఆయన పేర్కొన్నారు. చక్కటి సామాజిక సందేశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సెన్సార్ పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు బాబ్జీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, రచన-దర్శకత్వం: బాజ్జీ.
