బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ ఆధ్యర్యంలో అనిల్ గ్రంధి నివాసంలో డల్లాస్ ప్రముఖులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశములో దయాకర్ పూసుకురి, సతీష్ ఏటీఏ, వంశీ రెడ్డి టీటీఏ, రాజ్ పెరిగేలా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేస్తామని, అందరిని కలుపుకుని వెళ్తామని అంతా ముక్త కంఠముతో చెప్పారు.
