Namaste NRI

ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఆలస్యం

దేశ రాజధాని ఢిల్లీ ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది.  ఈ పొగమంచు కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం నెలకొంది. ప్రధాని మోదీ జోర్దాన్, ఇథియోపియా , ఒమన్‌ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమైంది. దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రధాని మూడు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. దృశ్య మానత కాస్త మెరుగుపడిన అనంతరం విమానం టేకాఫ్‌కు అధికారులు అనుమతించారు.

నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఇండిగో, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గడం వల్ల పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమయ్యాయని తెలిపాయి. విమానాల స్టేటస్‌ గురించి తెలుసుకోవడం కోసం తమ వెబ్‌సైట్లను పరిశీలిస్తూ ఉండాలని ప్రయాణికులకు సూచించాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events