Namaste NRI

రాజుగారి దొంగలు టీజర్‌ లాంచ్‌

లోహిత్‌ కల్యాణ్‌, రాజేష్‌ కుంచాడా, జోషిత్‌ రాజ్‌కుమార్‌, కైలాష్‌ వేలాయుధన్‌, పూజా విశ్వేశ్వర్‌, టీవీ రామన్‌, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం రాజుగారి దొంగలు. లోకేష్‌ రనల్‌ హిటాసో దర్శకుడు. నడి మింటి బంగారునాయుడు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్మాతలు వి.దామోదర ప్రసాద్‌, బెక్కెం వేణుగోపాల్‌, నటుడు జెమినీ సురేష్‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక,నిర్మాతలకు ప్రధాన పాత్రధారులంతా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత అద్భుతంగా సహకరించారని, అందరికీ నచ్చేలా సినిమా వచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సందీప్‌ బదుల, ప్రకాశ్‌రెడ్డి, సంగీతం: నాఫల్‌ రాజా ఏఐఎస్‌, నిర్మాణం: హిటాసో ఫిల్మ్‌ కంపెనీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events