హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కామెడీ ఎంటైర్టెనర్ సింగిల్. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. కార్తీక్రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్చౌదరి నిర్మాతలు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు చెందిన రెండో పాటను విడుదల చేశారు. జానీ జానీ ఎస్ పాపా జగమంతా జంటలే నేను తప్ప, నేనే నంబర్వన్ ఎర్రిపప్పా, ప్రేమించానంటమే పెద్ద తప్పా అంటూ సాగే ఈ పాటకు ఫ్రస్టేషన్ యాంథమ్గా మేకర్స్ పేరుపెట్టారు.

రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను విశాల్చంద్రశేఖర్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్లపై ఈ పాట చిత్రీకరించారు. హీరో ఒంటరితనాన్ని వినోదంతో జోడించి ఈ పాట ద్వారా చెప్పడం జరిగిందని మేకర్స్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, కెమెరా: ఆర్.వెల్రాజ్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్.
