ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్లను ధరించి రెడ్ కార్పెట్పై హొయలు పోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ కేన్స్లో సందడి చేస్తున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, నటి ఊర్వశి రౌతేలా, శోభిత ధూళిపాళ, కియారా అద్వానీ, అదిరి రావు హైదరీతో పాటు పలువురు తారలు కేన్స్లో మెరిశారు. శోభిత తొలిసారి రెడ్ కార్పెట్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్పుల్ కలర్ కోర్డెలియా జంప్సూట్లో సందడి చేశారు.