Namaste NRI

వచ్చే ఫిబ్రవరిలో భూమికి సునీతా విలియమ్స్

భారతీయ అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌తో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌విల్మోర్‌, నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్రూ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి చేరుకోనున్నారని అంచనా. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్‌ 5న బోయింగ్‌ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ తిరి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాముల ను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది.

 ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇందు కోసం స్పేస్‌ ఎక్స్‌కు చెందిన కార్గో వెర్షన్‌ని ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్‌ నాసా 31వ కమర్షియల్‌ రీసప్లై సర్వీసెస్‌ మిషన్‌గా పిలుస్తారు. ఈ రీసప్లై సర్వీసెస్ మిషన్ కింద సౌర గాలి, రేడియేషన్, స్పేస్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్‌పై పరిశోధనలు చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News