మన ఊరు` మన బడి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న ఎన్నారైలు మద్దతివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన కేటీఆర్ మన ఊరు` మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. తెలంగాణలోని తమ సొంత ఊళ్లలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.














