జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలు ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పతంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.














