Namaste NRI

ఆట ఇప్పుడే మొదలైంది.. ఆసక్తిగా గ్యాంబ్లర్స్‌ టీజర్‌

సంగీత్‌ శోభన్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం గ్యాంబ్లర్స్‌. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎస్‌కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మాతలు. టీజర్‌ని విడుదల చేశారు. యుద్ధం, జూదం ఒక్కటే. యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి అంటూ సాగే సంభాషణతో ఈ టీజర్‌ మొదలైంది.

ఇందులో సంగీత్‌శోభన్‌ ఓ గ్యాంబ్లర్‌గా కనిపించబోతున్నారని టీజర్‌ చూస్తే అర్థమవుతున్నది. సినిమాలోని ముఖ్యపాత్రలన్నీ టీజర్‌లో పరిచయమయ్యాయి. మిస్టరీ ఎంటైర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాలనూ అలరిస్తుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌ బన్న, సాయిశ్వేత, జస్విక, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 6న విడుదలకానుంది.   ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌ సాగర్‌, సంగీతం: శశాంక్‌ తిరుపతి.

Social Share Spread Message

Latest News