అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. చికాగోలోని ఇండియానా నైట్క్లబ్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల్లో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పుల జరిపిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడని, అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.














