తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్లో భారీ కూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు.అలాగే 1600 మందికి పైగా గాయాలపాయల్యారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వ ముందుకొచ్చిన అమెరికాకు కొత్త డిమాండ్ వినిపించింది. తాలిబన్లు ఆఫ్ఘాన్ను స్వాధీనం చేసుకోవడంతో జప్తు చేసిన ఆ దేశపు నిధులను విడుదల చేయాలని కోరింది. కాబూల్లో తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖి మీడియాతో మాట్లాడుతూ ఈ కష్టకాలంలో ఫ్రీజ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఆఫ్ఘాన్ బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాను కోరుతున్నామన్నారు. ఇలా చేస్తే సహాయం చేసే ఏజెన్సీలు ఆఫ్ఘనిస్థాన్కు సహకారం అందించడం సులభం అవుతుందన్నారు.














