భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా, చైనా భారత్కు సూచించాయి. తాజాగా రష్యా కూడా ఆ జాబితాలో చేరింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలపై భారత్, పాకిస్థాన్ ప్రత్యక్ష శాంతి ఒప్పంద చర్చలు జరపాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో ఇరుదేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం అని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా స్పందిస్తూ భారత్, పాక్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించింది. రెండు దేశాల మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది. రెండు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించింది.
