Namaste NRI

చైనాను వెనక్కి నెట్టేసిన యూఎస్‌

భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఏదీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది చైనా. కానీ ఈ చైనాను అమెరికా దాటేసింది. ఇప్పటికు వరకు భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంటూ వస్తున్న చైనాను అమెరికా వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద ట్రేడ్‌ పార్టనర్‌ ఏ దేశం అంటే అమెరికా చెప్పాల్సి ఉంటుంది. గతేడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ప్రకటించింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా` భారత్‌ మధ్య 119.42 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగినట్టు వెల్లడిరచింది. వాణిజ్య శాఖ అంచనా ప్రకారం అంతకు ముందు ఏడాది అంటే 2021`21 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాపారం విలువ 80.51 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అమెరికా`భారత్‌ మధ్య గణనీయమైన వ్యాపారం జరిగింది. ఎగుమతులు, దిగుమతులు రెండూ భారీగా పెరగడమే దీనికి కారణం. చైనాను కొన్ని ఏళ్లుగా భారత్‌కు పక్కన పెడుతూ వస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events