Namaste NRI

లండన్‌లో బ్రిటన్‌ పౌరుల కంటే.. భారతీయులకే ఎక్కువ

బ్రిటిష్‌ సామ్రాజ్యపు రాజధాని లండన్‌లో భారతీయులు పాగా వేశారు. లండన్‌లో అత్యధిక భాగం మనోళ్ల చేతుల్లోనే ఉన్నది. అవును, ఇది నిజమే. ఇప్పుడు లండన్‌లో ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నది భారతీయులే. ఇతర దేశాల వారినే కాదు, స్థానికులైన బ్రిటిషర్లను మించి మనవాళ్లు అక్కడ ఆస్తులను కలిగి ఉన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా బ్రిటన్‌కు వెళ్లిన భారతీయులు లండన్‌లో ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్టు బ్యారెట్‌ లండన్‌  విడుదల చేసిన ది రైజ్‌ ఆఫ్‌ ప్రాపర్టీ పవర్‌ ఇన్‌ లండన్‌ నివేదిక వెల్లడించింది. ఇది తాత్కాలిక ధోరణి మాత్రమే కాదని, లండన్‌ ప్రాపర్టీ మార్కెట్‌లో కనిపిస్తున్న గణనీయమైన మార్పు అని ఆ నివేదిక స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News