Namaste NRI

వారిని విడుదల చేయాలి…ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ నేతల పిలుపు

గాజాలో ఇజ్రాయెల్‌హమాస్ మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపాలని, హమాస్ బందీలో ఉన్న వారిని విడుదల చేయాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల నేతలు పిలుపునిచ్చారు. మానవతా సాయం ఎలాంటి ఆటంకాలు లేకుండా బాధితులకు అందేలా చొరవ తీసుకోవాలని కూడా కోరారు. ఈమేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా, కతార్, ఈజిప్టు దేశాలు 10 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికేలా మధ్యవర్తిత్వం నిర్వహించడానికి తీసుకుంటున్న చొరవకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల నేతలు మద్దతు పలికారు.

మధ్యవర్తులు కొన్ని నెలల పాటు దీనికోసం ప్రయత్నిస్తున్నారు. మూడు దశల ప్రణాళికను అంగీకరింప చేయ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం హమాస్ అక్టోబర్ 7న తాను బందీ చేసిన వారిలో మిగిలిన వారిని తక్షణం విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలాగే తాను బందీ చేసిన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచి పెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ఫ్రెంచి అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ , జర్మనీ ఛాన్సెలర్ ఒలాఫ్‌స్కాల్జ్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ సంతకాలు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events