అఖిల్రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈషా. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను హారర్ సినిమాల్ని ఇష్టపడతానని ఈషా సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుందని, హారర్ సినిమా ప్రేమికులు బాగా ఎంజాయ్ చేస్తారని, పతాక సన్నివేశాలు షాకింగ్గా అనిపిస్తాయన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని భయపెట్టి, ఓ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తామని, మంచి సినిమా చూసిన ఫీల్తో బయటికొస్తారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. చాలా రోజుల పాటు గుర్తుండిపోయే చిత్రమిదని, అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెలిపారు.















