సొహైల్, మోక్ష జంటగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్ . ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సొహైల్ మాట్లాడుతూ కథపై నమ్మకంతో టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రేక్షకులకు ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సినిమాపై నమ్మకంతో నిర్మాత హరిత గోగినేని సొంతంగా రిలీజ్ చేస్తున్నారు అని అన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని నిర్మాత హరిత గోగినేని తెలిపారు.
సినిమాకు వచ్చిన ప్రేక్షకులు చక్కటి ఫీల్తో థియేటర్ నుంచి బయటకొస్తారు. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. సొహైల్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది. తన సంపాదనలో ఎంతో మందికి ఆయన సహాయం చేస్తున్నారు అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకానుంది.