నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సస్సెన్స్ థ్రిల్లర్ ఘటికాచలం. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత కూడా. ప్రముఖ దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ కలిసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఘటికాచలం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు.

నిర్మాత ఎం.సి.రాజు ఇచ్చిన కథలోనే నావెల్టీ ఉందని, ఆ నావెల్టీనే టెక్నికల్గా హై క్వాలిటీతో సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చిందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఈ సినిమాను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని, హారర్, సస్పెన్స్ అంశాలుండే బొమ్మరిల్లు లాంటి సినిమా ఇదనీ, తండ్రీకొడుకుల ఎమోషన్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయని దర్శకుడు అమర్ కామేపల్లి చెప్పారు. తొలి సినిమాకే వైవిధ్యమైన పాత్ర దొరకడం ఆనందంగా ఉందని, దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారని హీరో నిఖిల్ దేవాదుల తెలిపారు. ఇంకా నిర్మాత ఎస్కేఎన్ కూడా మాట్లాడారు.
