హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు ఇదో హెచ్చరిక మాత్రమే.ఇకపై భారత్ వైపు చూస్తే పాకిస్తాన్ కు ఇదే గతి అంటూ పాల్గొన్న ప్రముకులు హెచ్చరించారు.

దేశ ప్రజల రక్షణ కోసం బోర్డర్ లో పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు.భారత్ వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తామంటూ చాటి చెప్పిన మన సైనికులకు సలాం అని సైనికులను కొనియాడారు.

దేశ రక్షణ రంగాన్ని ఆ దిశగా నడిపించిన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దేశ రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ లో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు, అమర జవాన్ మురళీ నాయక్ కు, అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పించారు. మీ త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు అన్నారు.

ఈ ర్యాలీలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ , నాగేష్ , రఘునందన్ రావు , ధర్మపురి అరవింద్ , రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, ఏయిర్ ఫోర్స్ సిబ్బంది, సినీ నటి జయప్రద,సినీ సెలబ్రిటీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
