Namaste NRI

లండన్‌లో విషాద ఘటన… తెలుగు యువకుడిని 

బ్రిటన్ రాజధాని లండన్‌  లో విషాద ఘటన చోటు చేసుకుంది. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్‌ తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు కిరణ్‌కుమార్‌(25) ఏలూరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. రెండున్నరేళ్ల కిందట లండన్‌  వెళ్లి ఎంఎస్‌ పూర్తి చేశారు. ఉద్యోగం సంపాదించడానికి కొన్ని  కోర్సుల్లో పట్టు సాధించేందుకు ట్రైనింగ్ క్లాసెస్ లకు హాజరవుతున్నారు. జూన్‌ 26న బైక్ పై  క్లాస్ కు వెళ్లుండగా అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ కిరణ్‌ను ఢీకొట్టాడు.  తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబసభ్యులు ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్‌  మృతదేహాన్ని లండన్‌ నుంచి స్వదేశానికి   విమానంలో తరలిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events