Namaste NRI

ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌.. ఉక్రెయిన్‌లో మోదీ ప్రయాణించే లగ్జరీ రైలు ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. పోలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్‌లో మోదీ  పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకోనున్నారు. ఇందుకోసం ఆయన 10 గంటల పాటు రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కీవ్‌లో ఏడు గంటల పాటు మోదీ ఉండనున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన అనంతరం తిరిగి ఇదే రైలులో పోలాండ్‌ చేరుకొని అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Social Share Spread Message

Latest News