Namaste NRI

మోడీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటి

జపాన్ లో జరుగుతోన్న జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ని కలిశారు. రష్యా- ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని తొలిసారి జ‌రిగిన‌ భేటి చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. యుద్దం, ప్ర‌స్తుతం ఉక్రేయిన్ లోని ప‌రిస్థితుల‌పై ఇరు దేశాల నేత‌లు సుదీర్ఘంగా చర్చించారు..

ఈ సమావేశంలో యుద్ధం గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ఇది ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది, కానీ నేను దానిని రాజకీయ లేదా ఆర్థిక సమస్యగా పరిగణించను. ఇది నాకు, మానవత్వం మరియు మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలు మా అందరికంటే మీకు బాగా తెలుసు.గత సంవత్సరం మా పిల్లలు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు, మీ పౌరుల వేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితులను పరిష్కరించడానికి భారతదేశం, నేను వ్యక్తిగతంగా సాధ్యమైనదంతా చేస్తాం అని ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events