Namaste NRI

16న తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక.. భారీగా స్వాగత ఏర్పాట్లు

కేంద్ర కేబినెట్‌ హోదాలో మంత్రి పదవిని చేపట్టాక తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రేమేందర్‌ వెల్లడిరచారు. ఈ నెల 16న కోదాడకు రానున్న కిషన్‌రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటించి 18న హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు. 16న కోదాడలో పర్యటించి ఆ రోజు రాత్రి ఖమ్మంలో బసచేస్తారని, 17న మహబూబాబాద్‌, నర్సంపేట, ములుగు మీదుగా వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి చేరుకుంటారని చెప్పారు. 18న జనగామ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి, అక్కడి నుంచి భువనగిరి, ఘట్‌కేసర్‌ మీదుగా హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంటారన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events