Namaste NRI

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఖరారు

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆగస్టు 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రముఖ ఆలయాల సందర్శనతో పాటు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాల సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు పూర్తయ్యా ఢల్లీి నుంచి బయల్దేరి రాత్రి తిరుపతికి చేరుకుంటారు. 16న ఉదయం తిరుమలలో దర్శనం అనంతరం బీజేపీ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి  నుంచి విజయవాడకు చేరుకుని, పార్టీ సమావేశంలో పాల్గొంటారు.. అనంతరం తెలంగాణ జిల్లాల్లో కిషన్‌ రెడ్డి పర్యటిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events