Namaste NRI

బిపిన్ రావత్ మృతిపట్ల యూఎస్ ఎంబసీ సంతాపం

భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు 12 మంది సైనికులు దుర్మరణం చెందడం పట్ల యూఎస్‌ ఎంబసీ ( అమెరికా రాయబార కార్యాలయం) సంతాపం ప్రకటించింది. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఇండియన్‌ మిలటరీని అభివృద్ధి చేసేందుకు ఎంతో పాటుపడ్డారు అని పేర్కొన్నది. భారత రక్షణ శాఖను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేశారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన బిపిన్‌ రావత్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీతో మిలటరీ అభివృద్ధితో పాటు సారూప్య దేశాలతో సహకారాన్ని పెంపొదించుకునే అవకాశాలపై రావత్‌ చర్చించినట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events