పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్తో కలిసి దర్శకుడు హరీష్ సెట్స్ను పరిశీలి చారు. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్ర షూటింగ్లో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల లేదా పూజా హెగ్డే నాయికగా నటించనుందని తెలుస్తున్నది.
