రుత్విక్ హీరోగా నటిస్తున్న చిత్రం వైభవం. సాత్విక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమాదేవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రమాదేవి మాట్లాడుతూ తన కుమారులైన సాత్విక్, రుత్విక్ సినిమా మీద పాషన్తో కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఈ సినిమా తీశారని, వారిద్దరూ విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.

చక్కటి మానవతా విలువలు, సునిశితమైన హాస్యం, కుటుంబ అనుబంధాలు కలబోసిన కథాంశమిదని, అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని దర్శకుడు సాత్విక్ పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ఇక్రా ఇద్రిసి తెలిపింది.
