Namaste NRI

ప్రధాని మోదీని ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ భామ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తన బాయ్‌ ఫ్రెండ్‌ నికోలై సచ్‌దేవ్‌ను మనువాడబోతోంది.ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి తన పెళ్లికి ఆహ్వానిస్తోంది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని కూడా ఆహ్వానించింది. కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి నటి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ మేరకు వెడ్డింగ్‌ కార్డును మోదీకి అందజేసి తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events