Namaste NRI

సింగపూర్‌ లో వైభవంగా వాసవి జయంతి

వాసవి క్లబ్‌ మెర్లియన్‌ సింగపూర్‌ (వీసీఎమ్‌ఎస్‌ ) వారి ఆధ్వర్యంలో వాసవి జయంతి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సింగపూర్‌లోని మారియమ్మన్‌ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో 400 మంది ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. వాసవి జయంతి పూజలతో పాటు సాంస్కృతిక అంశాలతో రూపొందించిన ఈ కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

అఖిల భారత ఆర్య వైశ్య సమాజ ప్రెసిడెంట్‌ జయదుర్గ, ఆధ్యాత్మికవేత్త కొండూరు పద్మావతి , వీసీఎమ్‌ఎస్‌ వ్యవస్థాపకులు నాగరాజ్‌ కైలా, బొబ్బ శ్రీనివాస్‌, సీనియర్‌ సభ్యులు లక్ష్మీ నారాయణ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. కైలా శారద, మంచికంటి స్వప్న ముఖ్య అతిథులను సత్కరించారు. దివ్య గాజులపల్లి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విధిజ్ఞా కొండూరి, నితిన్‌, సాయి కౌశల్‌ గుప్తా, నేరెళ్ల వెంకట నిరంజన, జై దేవాన్‌, సిద్ధి శ్రీ ముక్తిదా, సుప్రజ, దర్శకురాలు సాయి సంగీత తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ అలరించారు. సుజాత ఆధ్వర్యంలో కోలాటం దృశ్యరూపకంగా వాసవి మాత కథనాన్ని ఆవిష్కరించారు.

మౌల్యా కిషోర్‌ శెట్టి ప్రదర్శించిన వాసవి అగ్ని ప్రవేశం భరతనాట్యం ఆకట్టుకుంది. కొండూరి పద్మావతి ప్రవచనంలో కొత్త ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. సుమారు 150 మంది ఆర్యవైశ్య మహిళలు అమ్మవారిని కుంకుమార్చన, లక్ష పుష్పార్చనతో పూజించారు. వాసవి క్లబ్‌ మెర్లియన్‌ సింగపూర్‌ ప్రెసిడెంట్‌ పబ్బతి మురళీ కృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ ముక్క కిషోర్‌, అరుణ్‌ గొట్లూరు, సెక్రటరీ సుమన్‌ రాయల మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

కోట సతీష్‌ కుమార్‌-గంగ వసుధ, కళ్యాణ్‌ నంబూరి-మీరా, కోరుకొండ రవి కుమార్‌-అపర్ణ, ముక్క ఇంద్రయ్య-సుకన్య, దేవకీ కిరణ్‌- ప్రవీణ, కిశోర్‌ శెట్టి-హేమ, మంచికంటి శ్రీధర్‌పత్ని స్వప్న, పెరకం రమేశ్‌ ధర్మపత్ని మోహిని- లత, శిఖకోళ్ళు శ్రీహరి-స్వర్ణలత, గోకవరపు సూర్యప్రకాష్‌– లీల, మాటూరి హరీంద్ర నాథ్‌-పద్మావతి, ఉదయ్‌శంకర్‌ అశోక్‌-యామినీ, కోట సుబ్బారావు-శాంతి, మడిచెట్టు రాము-సరిత, నల్ల భాస్కర్‌-దీప్తి, కొత్తమసు దత్తపూజిత- దేవి, బొగ్గారపు సరితాదేవి ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్యులు, వాసవి సేవాదళ్‌ సభ్యులకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. వాసవి క్లబ్‌ మెర్లియన్‌ సంస్థ ముఖ్య కార్యకర్తలు అలేఖ్య గొట్లూరు, కారే శివకిషన్‌ గుప్త, కటకం మార్తాండ్‌, కిశోర్‌ శెట్టి, పంచనాథన్‌ జయకుమార్‌, మురళీ కృష్ణ పబృతి, మకేష్‌ భూపతి, స్వప్న మంచికంటి, వినయ్‌ బంటూర్‌ ఈ కార్యక్రమానికి సహకారం అందించారు.

వాసవి సేవాదళ్‌ సభ్యులు శిల్ప మకేష్‌, స్వాతి కరే, దివ్య రాయల, కాల్వ లక్ష్మణ్‌ రాజు, నంబూరి శ్రీనివాసరావు, బొగ్గారపు ప్రశాంత్‌, కటకం సంతోష్‌, కొత్తమసు దత్త, కొత్తమను పూజిత దేవి, సోము కార్తీక్‌, వెంకట్‌ క్రాంతికిరణ్‌, బోనాల మనోజ్‌ కుమార్‌, సంతోష్‌ బచ్చు, రామ మోహన్‌ కారుమూరి, ప్రభవ్‌ కారుమూరి, శ్రీనివాస్‌ ఆర్వేతి, మణికంఠ చుండూరు, రవి కుమార్‌ కొండూరి తదితరులు కార్యక్రమం విజయవంతానికి తమ వంతు కృషి చేశారు.

Social Share Spread Message

Latest News