Namaste NRI

అంత తొందరెందుకు?.. ఈయూతో టారిఫ్‌ డీల్‌పై ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. పెంచిన సుంకాలు త్వరలో అమల్లోకి రానున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌లతో ఆయా దేశాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని మెలోనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టారిఫ్‌లతో ఆదాయం వస్తోందన్నారు. టారిఫ్‌ డీల్‌ విషయంలో తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించారు. ఆ ఒప్పందాలు ఓ నిర్దిష్ట సమయంలో జరుగుతాయన్నారు. ఈయూ, ఇతర దేశాలతో డీల్స్‌ చేసుకోవడం చాలా సులువే అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో వంద శాతం ఒప్పందం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events