కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ (77) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే 12 చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ బహుమతి వరించింది. 1990-2023 మధ్య కాలంలో ఈ కథలను రాసిన బాను ముస్తాక్ లండన్లోని టేట్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో తన అనువాదకురాలు దీపా భస్తీతో కలిసి ఈ బహుమతిని అందుకున్నారు. దీని కింద బాను ముస్తాక్కు 50 వేల పౌండ్లు లభించాయి.

దీంతో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ను అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ఆమె ఘనత సాధించారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను ముస్తాక్ పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే తొలిసారి ఓ చిన్న కథను రాశారు. ఆ తర్వాత 26 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు బాను ముస్తాక్ రాసిన ఓ కథ పత్రికలో ప్రచురితమవడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
