ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ బాబా శివానంద్ శనివారం రాత్రి పరమపదించారు. ఆయన వయసు 128 సంవత్సరాలని ఆయన శిష్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను గత నెల 30న బీహెచ్యూ దవాఖానలో చేర్పించారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, యోగా, బాబా శివానంద్ జీవితం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. బాబా శివానంద్కు మోక్షం ఇవ్వాలని కాశీ విశ్వనాథుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన అనేక తరాలకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధాని నరేంద్ర మోడీ కీర్తించారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సిల్హెట్లో 1896 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. ఆయనకు ఆరేళ్ల వయస్సు ఉ న్నప్పుడు ఏర్పడిన క్షామంలో ఆయన తల్లిదండ్రులు మరణించారు. నాటి నుంచి ఆ యన పొదుపు, క్రమశిక్షణ, సగం కడుపుకే తినడం వంటి పద్ధతులు అలవరచుకున్నారు. యోగ, ఆధ్యాత్మికత ద్వారా సమాజానికి సేవలందించినందుకుగాను ఆయనకు 2022లో పద్మశ్రీ అవార్డును బహుకరించారు.
