Namaste NRI

భారత్ కీలక నిర్ణయం…ఐదేళ్ల తర్వాత చైనీయులకు మళ్లీ

ఈ వారం నుంచి చైనా జాతీయులకు భారతదేశ పర్యాటక వీసాల జారీ ప్రక్రియ ఆరంభవుతుంది. ఐదేళ్ల తరువాత ఈ టూరిస్టు వీసాల పునరుద్ధరణ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీని మేరకు ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సజావు ప్రక్రియలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణ తరువాతి క్రమంలో భారత్ చైనా మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.

కోవిడ్ మహమ్మారితో 2020లో భారతదేశం చైనా నుంచి పర్యాటకుల రాకపై నిషేధం విధించింది. తరువాత ఈస్టర్న్ లడ్ధఖ్ ఘర్షణతో ఈ ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు ఈ నిషేధం తొలిగిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. జులై 24 నుంచి చైనా జాతీయులు భారతీయ టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని బీజింగ్‌లోని భారతీయ రాయబార కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య ప్రజల రాకపోకలకు ఇది దారితీస్తుందని ప్రకటనలో తెలిపారు.

Social Share Spread Message

Latest News