హీరో రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఉపేంద్ర మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయ్యాను. గత 25ఏళ్లుగా తెలుగువారు నన్ను ఆదరిస్తున్నారు. ఓ హీరోకి, అభిమానికి మధ్య ఉండే డివైన్ ఎమోషన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు అని అన్నారు.

చిత్ర నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ లాంగ్న్ ఉండే సినిమా ఇది. మూడువారాల పాటు బాగా పర్ఫార్మ్ చేస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.రంగస్థలం విషయంలో రామ్చరణ్ తన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ను చాలా రోజుల తర్వాత తీసుకున్నారు. సర్కారు వారి పాట రిలీజైన ఏడాదికి మహేష్బాబు రెమ్యునరేషన్ అందుకున్నారు. వాల్తేరు వీరయ్య కోసం చిరంజీవి, రవితేజ ఇలాగే చేశారు. పవన్కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్, ఉపేంద్ర కూడా నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అందరికీ డబ్బే ముఖ్యం కాదు. నిర్మాతకు అండగా ఉండే హీరోలున్నారు అని చెప్పారు. ఓ అభిమాని కథగా ఎమోషనల్ కంటెంట్తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నదని దర్శకుడు మహేష్బాబు పి పేర్కొన్నారు.
















